ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా సైడ్ బిజినెస్ లు చేసుకుంటున్నారు.కేవలం సినిమా మీదనే ఆధారపడకుండా వేరొక వ్యాపారాలలో భాగస్వాములు కావడం లేదంటే తామే సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేయడం చేస్తున్నారు.
హీరోలు, హీరోయిన్స్ అందరూ మార్గం ఎంచుకున్నారు.డిమాండ్ ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అనే సామెతని ఫాలో అవుతూ వారికున్న డిమాండ్ ని ఉపయోగించుకొని వ్యాపారాలని కూడా భాగా విస్తరించుకునే పనిలో పడ్డారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎన్బి సినిమాస్ అంటూ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు.మరో వైపు నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పుడు అతని దారిలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా వ్యాపారంలో అడుగుపెట్టాడు.ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ అంటూ బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
అలాగే నిర్మాతగా కూడా మారిపోయి రెండో సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.మహబూబ్ నగర్ సిటీలో తిరుమల థియేటర్స్ ని కొనుగోలు చేసి వాటిని పూర్తిగా మార్చేసి ఏవిడి సినిమాస్ అనే పేరుతో తిరిగి ప్రారంభిస్తున్నాడు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని ఆ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో రౌడీ స్టార్ ఉన్నాడు.
ఏప్రిల్ 9న దేవరకొండ మూవీ థియేటర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది.మరో వైపు అల్లు అర్జున్ కూడా ఇప్పటికే అమీర్ పీటలోని సత్యం థియేటర్ తీసుకొని దానిని మల్టీప్లేక్స్ గా మార్చేస్తున్నాడు.
మొత్తానికి హీరోలు అందరూ ఇలా తమ సొంత వ్యాపారాలతో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.