రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.
ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.
యాక్షన్ పార్ట్ ఇంకా మిగిలి ఉంది.దాంతో పాటు సాంగ్స్ కూడా షూట్ చేయాల్సి ఉంది.
కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా వేశారు.కంప్లీట్ ముంబై బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఇక ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇక దీని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు.టక్ జగదీష్ రిలీజ్ తర్వాత విజయ్ తో మూవీని శివ నిర్వాణ సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ మరో దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.జెర్సీతో నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న గౌతమ్ తిన్నునూరి చెప్పిన కథకి ఒకే చెప్పాడని వినికిడి.
ఇది పూర్తిగా ఎమోషనల్ లవ్ డ్రామా అని టాక్ వినిపిస్తుంది.ఈ ప్రేమకథలో గౌతమ్ చెప్పిన ఎలిమెంట్స్ తనకి భాగా కనెక్ట్ కావడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని గౌతమ్ కి విజయ్ సూచించినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు గౌతమ్ అదే పనిలో ఉండి స్క్రిప్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని టాక్.ఇది ఒకే అయితే దీనిని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.