కరోనా వైరస్.వచ్చి ఎనిమిది నెలలు అయ్యింది.దైర్యంగా ఎవరు బయటకు వెళ్లలేకపోతున్నారు.చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రజలను ఎంత దారుణంగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వ్యాక్సిన్ రానప్పటికీ సీజనల్ వైరస్ లా భావించి ప్రజలు అంత రోడ్లపై ఎంతో హ్యాపీగా తిరుగుతున్నారు.
ఇక కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని పూర్తిగా ఆగిపోయాయి.
లాక్ డౌన్ మొత్తం ఎంతో ఆనందంగా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉన్న ఈ హీరో హీరోయిన్లు ఇప్పుడు షూటింగ్ లకు అనుమతి దొరకడంతో అందరూ షూటింగ్ లు మొదలెట్టేశారు.ఇక ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు షూటింగ్ కోసం మరో హీరోయిన్ హైదరాబాద్ కు వచ్చింది.పైన ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫోటోలో నల్ల దుస్తుల్లో కనిపిస్తున్న నల్ల హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? లేదు కదా! ఆమెనండి.రష్మిక.తీసిన ప్రతి సినిమా హిట్ అయ్యి అతి తక్కువ కాలంలో మంచి స్టార్ హీరోయిన్ అయ్యింది కదా! ఆమె రష్మిక.
అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించనున్న ఆమె సినిమాలో నటించేందుకు కరోనా వైరస్ ని సైతం లెక్క చెయ్యకుండా హైదరాబాద్ కు చేరుకుంది.తాజాగా ఆమె మాస్క్ ధరించి ఎవరు గుర్తుపట్టలేనంత విధంగా కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇక అలానే మరో హీరో కూడా సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యాడు.అతడు ఎవరో గుర్తుపట్టారా?
ఇంకా లేదా? అతడే అండి.రౌడీ విజయ్ దేవరకొండ.చాలా రోజుల తర్వాత జిమ్ వేర్ లో జిమ్ సెంటర్ వద్దకు వచ్చాడు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటించనున్నాడు.రష్మిక, విజయ్ లకు సంబంధించిన తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.