విజయ్ దేవరకొండ ఈ వారంలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్లో విజయ్ దేవరకొండ పాల్గొనక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
అసలు ఈ చిత్రం ప్రమోషన్స్కు విజయ్ ఎందుకు హాజరు కావడం లేదు అనేది చాలా మంది ప్రశ్న.ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర సమాధానం లభించింది. ఈ చిత్ర నిర్మాత కేఎస్ రామారావు అర్జున్ రెడ్డి చిత్రం విడుదల అయిన సమయంలో ఈయనకు అడ్వాన్స్ ఇచ్చాడట.దాదాపుగా కోటి రూపాయల పారితోషికంతో మాత్రమే ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేశాడంటూ సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఆయనకు ఉన్న క్రేజ్కు అయిదు నుండి పది కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు.అలాంటిది ఈ చిత్రం కోసం చాలా తక్కువ పారితోషికం దక్కిందనే ఉద్దేశ్యంతోనే ఆయన ప్రమోషన్స్కు హాజరు అవ్వడం లేదు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు.దాదాపు మూడు పాత్రల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.నలుగురు హీరోయిన్స్తో ఈయన రొమాన్స్ చేశాడు.ట్రైలర్ను దాదాపుగా ఏడు మిలియన్ల మంది చూశారు.సినిమాపై ఇంకా క్రేజ్ను క్రియేట్ చేసేందుకు విజయ్ ప్రమోట్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు.