టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేసారు.గీత గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ జంట రెండవ సినిమాగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం కొద్దిగా నిరాశ పరిచింది.
అయితే విజయ్, రష్మిక మంచి స్నేహితులు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళాడు.
రష్మిక కూడా మిస్టర్ మజ్ను సినిమా కోసం ముంబై లోనే ఉంటుంది.ఈ కారణంగా నే ఇద్దరు కలిసి డిన్నర్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే వీళ్లిద్దరు ప్రేమించు కుంటున్నారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఇద్దరు కలిసి తిరుగుతుండడంతో ఈ వార్తలు మళ్ళీ మొదలయ్యాయి.
ఇది ఇలా ఉండగా విజయ్ సినిమా విషయానికి వస్తే లైగర్ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.ఈ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.
ఈ సినిమాను పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా ను సెప్టెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.