విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ కే పరిమితం కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా క్రేజీ హీరోగా పేరు దక్కించుకున్నాడు.కేవలం సౌత్ ఇండియా ఏం ఖర్మా ఆమద్య బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా ఆయన్ను పిలిపించుకుని మాట్లాడిన విషయం తెల్సిందే.
ఒక సినిమాను చేద్దామని అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది.అంతటి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’.
ఈ చిత్రాన్ని అదే టైటిల్తో తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడంలో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.సౌత్ ఇండియాకు చెందిన అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
తాజాగా ఫస్ట్లుక్ పోస్టర్ను రివీల్ చేశారు.భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ను 17వ తారీకున వదలబోతున్నట్లుగా ప్రకటించారు.నాలుగు భాషల్లో కూడా టీజర్ను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.ఈమద్య కాలంలో బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా ఈస్థాయిలో ఇన్ని భాషల్లో విడుదల అయ్యింది లేదు.
బాహుబలి తర్వాత స్థానంలో డియర్ కామ్రేడ్ నిలుస్తుందని చెప్పడంలో సందేహమే లేదు.సౌత్ ఇండియా మొత్తంలో కూడా విడుదల కాబోతున్న డియర్ కామ్రేడ్ చిత్రంతో విజయ్ దేవరకొండ స్థాయి ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ చిత్రంలో గీత గోవిందం ఫేం రష్మిక మందన్న నటించడంతో తమిళం మరియు కన్నడంలో కూడా ఈ చిత్రంపై ఆసక్తి ఉంది.కన్నడ నాట ఈ అమ్మడు మంచి స్టార్ హీరోయిన్ అందుకే కన్నడంలో ఈ చిత్రంకు మంచి బిజినెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈనెల 17న టీజర్ను విడుదల చేసి వచ్చే నెలలో షూటింగ్ను పూర్తి చేసి మే చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.
ఈ చిత్రంతో సౌత్ స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తాను చాటుతాడేమో చూడాలి.