సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈయన ఎక్కడ అడుగు పెట్టిన.
ఏం మాట్లాడినా.ఏం ధరించినా.
అన్ని కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే విజయ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
ఈయనకు బాలీవుడ్ లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
ఇది ఇలా ఉండగా విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.ఈ సినిమా ఆగష్టు 25న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది.
ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచాడు పూరీ.ఈ క్రమంలోనే ఇటీవలే ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా చేసారు.
అయితే ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రొమోషన్ చేయలేదు.కానీ లైగర్ టీమ్ మాత్రం బాలీవుడ్ లో వరుస ప్రొమోషన్స్ చేస్తుంది.ఈ విషయం పైనే విజయ్ ఫ్యాన్స్ ఆయనపై కోపంగా ఉన్నారు.
కేవలం బాలీవుడ్ మీదనే ద్రుష్టి పెట్టి అక్కడ మాత్రమే ప్రొమోషన్స్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రొమోషన్స్ చేయాలని.వాటి మీద ద్రుష్టి పెట్టాలని టీమ్ ను రౌడీ ఫ్యాన్స్ కోరుతున్నారు.
ముందు తెలుగు ప్రొమోషన్స్ చుడండి.ఆ తర్వాతే ఇతర భాషలపై ద్రుష్టి పెట్టండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.మరి వీరి విఘ్నప్తి ని లైగర్ టీమ్ పట్టించు కుంటారో లేదో చూడాలి.
తాజా వార్తలు