టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని చాలా శ్రమిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను పూరీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండడం వల్ల విజయ్ కూడా బాక్సింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.
ఇక ఈ సినిమా ప్రెసెంట్ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది.సెప్టెంబర్ 30 వారికి ఇక్కడే గోవాలోనే స్టేడియం సెట్ నిర్మించి అందులోనే షూటింగ్ చేస్తున్నారు.
ఇక్కడ షూటింగ్ పూర్తి అయినా తర్వాత తర్వాత షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.అయితే చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్లేముందే అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
సెప్టెంబర్ 28న పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలనీ అనుకుంటున్నారట.ఈ టీజర్ అసలు విజయ్ పుట్టిన రోజుకే విడుదల అవ్వాల్సి ఉండగా అప్పుడు కరోనా ఎక్కువుగా ఉండడంతో వాయిదా వేశారు.
ఈ మేరకు మేకర్స్ అనౌన్స్ కూడా చేసారు.మంచి సమయం చూసి ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని ప్రకటించారు.ఇక ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని చిత్ర యూనిట్ భావిస్తుంది.పూరీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు ఈ మరి కొద్దీ గంటల్లో ఈ అప్డేట్ గురించి అఫీషియల్ గా ప్రకటించే అవకాశం కూడా ఉందని టాక్.
ఇక రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.అలాగే ఈసారి పూరీ బర్త్ డే కూడా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఛార్మి ఈ సారి పూరి పుట్టిన రోజు వేడుకలను గోవా బీచ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.