విజయ్ దేవరకొండ, పూరి జగన్నాద్ ల కాంబోలో రూపొందుతున్న లైగర్ సినిమా చిత్రీకరణ విషయంలో గందరగోళం ఏర్పడింది.ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.
కారణం కరోనా అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది.తాజాగా చివరి షెడ్యూల్ ను మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించారు.
ఛార్మి షేర్ చేసిన ఈ ఫొటోలో రక్తం మరియు చెమట కారుతున్నా కూడా పోరాటం మాత్రం ఆపడం లేదు అంటూ కామెంట్ పెట్టింది.అంటే భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్నాయని అర్థం అవుతోంది.
విజయ్ దేవరకొండ జుట్టు ఎక్కువగా పెంచుకున్నాడు.దాన్ని చాలా స్టైలిష్ గా ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా ఈఫొటోను చూస్తుంటే అర్థం అవుతుంది.
తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా ముద్దుగుమ్మ అనన్య పాండే నటిస్తోంది.
పూరి జగన్నాద్ తన సొంత బ్యానర్ లో ఛార్మి మరియు కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.మొదటి సారి గా పూరి జగన్నాధ్ పాన్ ఇండియా మూవీని విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు.సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న కారనంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
భారీ ఎత్తున బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు.యాక్షన్ సన్నివేశాల కోసం విదేశాల నుండి ఫైటర్స్ ను రప్పిస్తున్నారట.మొత్తంగా ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుంది అంటూ నెటిజన్స్ కు నమ్మకం కలుగుతుంది. రౌడీ స్టార్ అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా తో ఫిదా అవుతారని అంటున్నారు.