రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమా చిత్రీకరణ మూడు వారాల క్రితం అమెరికాలో చివరి షెడ్యూల్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.రెండు వారాల్లో ముగుస్తుందని భావించిన లైగర్ యూఎస్ షెడ్యూల్ కాస్త ఆలస్యం అయ్యింది.
క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా దర్శకుడు పూరి ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా ఏమాత్రం రాజీ పడకుండా సినిమాను తీస్తున్నాడు.
దాదాపుగా వంద కోట్లకు పైగా బడ్జెట్ ను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.
ఇంత భారీ స్థాయిలో గతంలో విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమాకు కూడా ఖర్చు చేయలేదు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమాకు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.మైక్ టైసన్ వంటి రియల్ సూపర్ స్టార్ కూడా నటించడం వల్ల దేశ వ్యాప్తంగా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా ల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే.లైగర్ సినిమా లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.
పెద్ద ఎత్తున అంచనాలున్న లైగర్ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వడంతో విడుదల తేదీ ఎప్పుడు అనే విషయమై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.విజయ్ దేవర కొండ గత చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నారు.ఏప్రిల్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
లైగర్ సినిమా కు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.పూరి మరియు ఛార్మిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.