రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది.పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా ను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక నిర్మాత అయిన ఛార్మి యాంకర్ అవతారం ఎత్తింది.యాంకర్ గా విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ ల యొక్క ఇంటర్వ్యూ తీసుకుంది.
వారిద్దరిని మీడియా మరియు ఫ్యాన్స్ అడగాలని భావించిన ప్రశ్నలను అడిగేసింది.కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.
భారీ గా ఖర్చు పెట్టిన నేపథ్యంలో చేతిలో ఒక్క రూపాయి కూడా లేనప్పుడు వచ్చిన ఓటీటీ ఆఫర్ అంటూ ఛార్మి కన్నీళ్లు పెట్టుకుంది.సినిమా ను ఎందుకు ఓటీటీ కి ఇవ్వలేదు అనే విషయమై రేపు పూర్తి ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఛార్మి ఈ సినిమా కు కేవలం నిర్మాత అన్నట్లుగా కాకుండా ప్రొడక్షన్ మేనేజర్ మొదలుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా భాగస్వామి అయ్యింది.ప్రతి విషయంలో కూడా ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
అందుకే సినిమా కరోనా సమయంలో ఆగి పోతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యాను అంటూ స్వయంగా ఛార్మి చెప్పుకొచ్చింది.సినిమా ను ఓటీటీ కి ఇవ్వకుండా మంచి పని అయ్యింది.
ఇప్పుడు సినిమా ఏకంగా 200 కోట్ల వరకు రాబడుతుంది.ఒక వేళ ఓటీటీ కి ఇచ్చి ఉంటే ఇందులో సగం అయినా వచ్చేది అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఇప్పుడు లైగర్ కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో భారీ గా విడుదలకు సిద్ధం అయ్యారు.