దేశంలోనే టాప్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ అయిన కోకాకోలా పదుల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రతి ఏడాది అతి పెద్ద స్టార్స్ తో తమ థమ్స్ అప్ కు ప్రమోషన్ చేయిస్తూ ఉంటుంది.ఎన్నో ఏళ్లుగా ప్రముఖ స్టార్ హీరోలు ఈ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
బాలీవుడ్ కు చెందిన పలువురు సూపర్ స్టార్స్ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించారు.అందుకే చాలా మంది ప్రముఖ హీరోలు థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా గౌరవంగా భావిస్తూ ఉంటారు.
అందుకే తాజాగా విజయ్ దేవరకొండకు ఆ అవకాశం దక్కింది.గతంలో మహేష్ బాబు టాలీవుడ్ నుండి ఆ ఘనత దక్కించుకున్నాడు.గతంలో మహేష్ బాబు దాదాపు అయిదు కోట్ల రూపాయల పారితోషికంను అందుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇప్పుడు విజయ్ దేవరకొండుకు ఉన్న పాన్ ఇండియా మార్కెట్ నేపథ్యంలో ఏకంగా 10 కోట్లకు పైగా పారితోషికంను విజయ్ దేవరకొండ దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
సాదారణంగా అయితే ఉత్తర భారతంకు బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రమోషన్ చేయిస్తారు.
సౌత్ లో ఒక హీరోతో ప్రమోషన్ చేయిస్తారు.కాని ఈసారి విజయ్ దేవరకొండ రెండు ప్రాంతాలకు గాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు.దేశ వ్యాప్తంగా ఆయనకు ఉన్న గుర్తింపు కారణంగా ఈ సమయంలో ఆయనకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ప్రమోషన్ చేయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా థమ్స్ అప్ విజయ్ దేవరకొండ యొక్క కమర్షియల్ యాడ్ వీడియోను షేర్ చేయడంతో పాటు ఈ పోస్టర్ ను కూడా షేర్ చేసింది.లైగర్ లుక్ లో విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ లో కుమ్మేశాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.