టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ.పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ తరువాత అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో ఏకంగా స్టార్ అయిపోయాడు.
ఈ మూడు సినిమాలు అతనికి తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చాయి.తరువాత చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయిన విజయ్ దేవరకొండ అంటే ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఈ జెనరేషన్ యూత్ ఐకాన్ గా అందరూ అతన్ని భావిస్తూ ఉండటంతో పాటు తెలంగాణ నుంచి వచ్చి స్టార్ అయిన హీరో కావడంతో అతనికి ఎక్కువ క్రేజ్ వచ్చింది.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ లాంటి డాషింగ్ డైరెక్టర్ గా లైగర్ అనే సినిమాతో విజయ్ దేవరకొండ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
ఇక నెక్స్ట్ క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు.ఈ సినిమా ఏకంగా వంద కోట్ల భారీ బడ్జెట్ తో వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ లో మరికొందరు స్టార్ దర్శకులు కూడా విజయ్ తో భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు విజయ్ తో వంద కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ మూవీ చేయాలని ప్లాన్ చేశారు.
అది ఎప్పుడు అఫీషియల్ కన్ఫర్మ్ అవుతుందో తెలియదు.
అయితే ప్రస్తుతం లైగర్ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ ముంబైలో ఉంటున్నాడు.
షూటింగ్ అయిపోయిన తర్వాత మన రౌడీ హీరో బాలీవుడ్ లో రెగ్యులర్ గా జరిగే సెలబ్రిటీ నైట్ పార్టీలకి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.పనిలో పనిగా బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో టచ్ లోకి వెళ్తున్నాడు.
అలాగే అక్కడ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ తో మంచి ర్యాపో మెయింటేన్ చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఇప్పటికే కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో హిందీలో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
మరికొందరు నిర్మాతలు కూడా విజయ్ తో టచ్ లోకి వెళ్లి హిందీ సినిమాల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.హిందీలో విజయ్ సినిమాలు చేసిన అవి తెలుగులో కూడా స్ట్రైట్ గా రిలీజ్ అవుతాయి కాబట్టి మార్కెట్ పరంగా కూడా ఇబ్బంది ఉండదనే ఆలోచనతో ఆ విధంగా విజయ్ దేవరకొండ కూడా ప్లానింగ్ చేస్తున్నట్లు బోగట్టా.