టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అంరదూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ముంబైలో నిర్వహించిన చిత్ర యూనిట్ లాక్డౌన్ కారణంగా షూటింగ్ను వాయిదా వేసింది.
ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు పూరీ రెడీ అవుతున్నాడు.కాగా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా ఇతర రాష్ట్రాల నటీనటులు వేరే ప్రాంతాలకు వెళ్లి సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఫైటర్ చిత్రానికి సంబంధించి ఫారిన్ ఫైటర్లతో యాక్షన్ చేయాల్సి ఉండగా, ఇప్పుడు లోకల్ ఫైటర్లతో షూటింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక ఫారిన్ లొకేషన్స్లో పాటలు సైతం లోకల్గానే ముగించేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
మొత్తానికి కరోనా ఎఫెక్ట్తో ఫైటర్ కూడా మేడ్ ఇన్ ఇండియా మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.పూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తోండగా పూరీ కనెక్ట్స్పై ఈ సినిమాను ప్రొడ్సూస్ చేస్తున్నారు.
మరి ఫైటర్ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.