టాలీవుడ్ రౌడీ స్టార్ గా గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని విజయ్ చాలా శ్రమిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.
ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలను పెంచింది.అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదల అయ్యి చాలా రోజులు అవుతుంది.
ఈ సినిమా నుండి మరొక అప్డేట్ రాలేదు.అందుకే ఈ సినిమా నుండి అప్డేట్ కావాలని ఫ్యాన్స్ పూరీని రిక్వెస్ట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయంపై పూరీని అడుగుతున్నారు.పూరీ జగన్నాథ్ ను మా హీరో సినిమా నుండి అప్డేట్ వచ్చి చాలా కాలం అవుతుంది.ఈ సినిమా విడుదల లేట్ అయినా పర్వాలేదు కానీ ముందు ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ ఇవ్వండి సర్ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు.చూడాలి మరి పూరీ గారు వీళ్ళ భాధను అర్ధం చేసుకుంటాడో లేదో.
ఇక ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.
బడ్జెట్ విషయం లో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.