టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.గీతా గోవిందం తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూశారు.
అంతేగాక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా అని అందరూ అనుకున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి అందరి అంచనాలను తలకిందలు చేసింది.
ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ రాకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్గా మిగిలింది.విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా ఫెయిల్యూర్తో నిరాశకు గురయ్యారు.
ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించిన నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది.తాజాగా ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు.
బాలీవుడ్ జనాలు ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు.రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి.
ఇంతటి రెస్పాన్స్ను చూసిన నిర్మాతలు సినిమాను బాలీవుడ్లో కూడా రిలీజ్ చేసుండాల్సిందని అనుకుంటున్నారు.