విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామా అంటూ యూనిట్ సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
స్టూడెంట్ లీడర్ గా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక విజయ్ దేవరకొండ ఈ చిత్రంను మొన్నటి వరకు జూన్ లో విడుదల చేస్తామంటూ ప్రకటించాడు.
అయితే తాజాగా అందుతున్న మాచారం ప్రకారం ముందే అంటే మేలోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముందు నుండి అనుకుంటున్నట్లుగా కాకుండా రెండు మూడు వారాల ముందుగానే షూటింగ్ సాగుతోంది.అనుకున్న షెడ్యూల్స్ అన్ని కూడా చాలా సక్సెస్ ఫుల్ గా త్వరగా పూర్తి అయ్యాయట.దాంతో బ్యాలన్స్ వర్క్ను మార్చి వరకు పూర్తి చేసి ఏప్రిల్ లో నిర్మాణానంతర కార్యక్రమాలు నిర్వహించి మేలో సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు భరత్ కమ్మ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ చిత్రం ఎక్కువగా ఏపీలోని గోదావరి జిల్లాలో షూటింగ్ జరిగింది.విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంను మేలోనే విడుదల చేయాలని యూనిట్ సభ్యులు నిర్ణయించిన నేపథ్యంలో రౌడీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘డియర్ కామ్రేడ్’ విడుదల అయిన వెంటనే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాపై విజయ్ దేవరకొండ దృష్టి పెట్టబోతున్నాడు.ఈ చిత్రం మరింత విభిన్నంగా ఉంటుందట.విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుల లీడర్ గా కనిపించడంతో పటు, 10 సంవత్సరాల కుర్రాడికి తండ్రిగాను కనిపించబోతున్నాడట.విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న క్రాంతి మాధవ్కు తప్పకుండా విజయ్ దేవరకొండ కమర్షియల్ బ్రేక్ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
నలుగురు హీరోయిన్స్ ఈ చిత్రంలో నటించబోతున్నారు.ఈ రెండు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.