విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో దేశ వ్యాప్తంగా స్టార్డంను దక్కించుకున్నాడు.గీతగోవిందం చిత్రం సమయంలో విజయ్ దేవరకొండ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఏకంగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ స్వయంగా విజయ్ దేవరకొండను బాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించాడు.కాని విజయ్ దేవరకొండ మాత్రం ఆ సమయంలో నో చెప్పాడు.
ఇప్పుడు డియర్ కామ్రేడ్ రీమేక్తో విజయ్ దేవరకొండ బాలీవుడ్కు వెళ్తున్నాడంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్లో ‘డియర్ కామ్రేడ్’ను రీమేక్ చేయబోతున్నట్లుగా కరణ్ జోహార్ ప్రకటించాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా ఆయన స్వయంగా ప్రకటించాడు.దాంతో రీమేక్కు ఖచ్చితంగా విజయ్ దేవరకొండనే హీరోగా కరణ్ తీసుకుంటాడని అంతా భావించారు.
కాని తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను డియర్ కామ్రేడ్ హిందీ వర్షన్లో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.
బాలీవుడ్లో సినిమా చేయాలనే ఆలోచన తనకు ఉందని, అయితే అది ఎప్పుడు అనే విషయంపై తనకే క్లారిటీ లేదన్నాడు.సౌత్లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో త్వరలోనే హిందీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఎందుకంటే సౌత్ హీరోలు నార్త్లో అదృష్టంను పరీక్షించుకోవడం చాలా కామన్గా చూస్తూనే ఉంటాం.
ఒక మంచి ప్రాజెక్ట్తో ఈయన ఆ ఇండస్ట్రీకి వెళ్లే అవకాశం ఉంది.