తెలుగు పరిశ్రమలో సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ.తనకున్న రౌడీ ఇమేజ్ తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ డ్యాషింగ్ హీరో సినిమా అంటే యూత్ ఆడియన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తారు.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూడు సినిమాల హిట్ తో టాలీవుడ్ లో మాస్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈసారి పెద్ద టార్గెట్ తో వస్తున్నాడు.
పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న లైగర్ పై విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.లైగర్ తర్వాత మళ్ళీ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లోనే జనగణమన సినిమా ఓకే చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.
మహేష్ తో అనుకున్న జన గణ మన సినిమాని ఫైనల్ గా విజయ్ తో ఫిక్స్ చేసుకున్నాడు పూరీ జగన్నాథ్.అయితే లైగర్ వెంటనే జనగణమన అంటే రెండు వరుస సీరియస్ సినిమాలే అవుతాయని అనుకున్నాడో ఏమో లైగర్ తర్వాత వెంటనే శివ నిర్వాణతో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
సినిమాకు ఖుషి టైటిల్ పరిశీలనలో ఉండగా ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.మహానటిలో మెప్పించిన విజయ్, సమంత కాంబో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
లైగర్ ఎలాగు మాస్ సినిమాగా వస్తుండగా ఆ నెక్స్ట్ ఖుషి అంటూ సూపర్ లవ్ స్టోరీతో యూత్ ని ఆకట్టుకోనున్నాడు.ఆ వెంటనే మళ్ళీ పూరీ జనగణమన ప్లాన్ చేసుకున్నాడు.
పర్ఫెక్ట్ సినిమాల లైనప్ తో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియెన్స్ ని మెప్పించేలా విజయ్ సినిమాలు వస్తున్నాయని చెప్పొచ్చు.లైగర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం మరో టాలీవుడ్ హీరో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నట్టే లెక్క.
దాని బేస్ తో జనగణమనని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు విజయ్ అండ్ పూరీ టీం.