టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండ ఒకరి.ఈయనకు యూత్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం విజయ్ బాక్సింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ.మొదటిసారి విజయ్ పాన్ ఇండియా స్టార్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోవాలని రౌడీ అనుకుంటున్నాడు.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలను పెంచింది.
ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటె ఈ సినిమాకు ఓటిటి నుండి బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఓటిటి ఈ సినిమాకు 200 కోట్లు ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ విషయంపై విజయ్ స్పందించారు.ఇది చాలా తక్కువ అంతకు మించి థియేటర్ లో చూపిస్తా నంటూ రౌడీ తనదైన మార్క్ పంచ్ విసిరారు.
దీనితో ఈ సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుందని చెప్పకనే చెప్పాడు విజయ్
.తాజా వార్తలు