టాలీవుడ్ లో ఊహించని విధంగా అతి తక్కువ టైంలో తక్కువ సినిమాలతో స్టార్ హీరో క్రేజ్ కి దూసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ.తెలంగాణ నుంచి నితిన్ తర్వాత చాలా కాలం తర్వాత హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ యువ హీరో వరుస విజయాలతో, తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
అయితే తాజాగా డియర్ కామ్రేడ్ సినిమా రూపంలో అతనికి డిజాస్టర్ సినిమా పడిన కూడా విజయ్ క్రేజ్ కారణంగా ఆ సినిమాతో పెద్దగా ఎవరు నష్టపోలేదు అనే టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విజయ్ కి నెక్స్ట్ కచ్చితంగా సక్సెస్ కావాలి.
ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలంగాణలో ఓ మంచి పని కోసం ప్రభుత్వంతో జత కడుతున్నాడని టాక్ వినిపిస్తుంది.విజయ్ దేవరకొండ తెలంగాణ వాటర్ బోర్డు కు బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్నాడని తెలుస్తుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ లో నీరు దొరకక చాల మంది ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు.దీనిపై విజయ్ దేవరకొండ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నీటి సమస్యలని వివరిస్తూ జాగ్రత్తగా నీరు వినియోగించమని రాబోయే రోజులలో వాటర్ వల్ల వచ్చే అనర్ధాల గురించి ప్రచారం చేయనున్నాడని తెలుస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు నీటి సమస్యపై అవగాహన కల్పించడానికి నేరుగా దిగుతాడా లేక యాడ్ ద్వారా ప్రచారం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.