విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో పరిచయం అక్కరలేని హీరో.చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరుని సంపాదించుకున్నాడు.‘పెళ్లిచూపులు’ సినిమా విజయం దక్కించుకున్న పెద్ద గా గుర్తింపు ఏమి రాలేదు.ఆ తరువాత ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయంతో టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన రాత్రికి, రాత్రే చేరిపోయాడు.
ఆ తరువాత నోట సినిమా పరాజయం అయినా కానీ విజయ్ స్టార్ స్టేటస్ మాత్రం తగ్గలేదు.గీత గోవిందం చిత్రంతో ఇటు యూత్ ని అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేశాడు.
ఈ మద్య నిర్మాత గా మారి ఓ సినిమాను కూడా నిర్మించాడు.ఆ చిత్రం పర్వాలేదు అనిపించింది.ఈ మద్య కాలంలో విజయ్ సినిమాల గురుంచి పెద్దగా సోషల్ మీడియాలో కూడా ఏమి ప్రచారం లేదు.కానీ మనవాడి పేరు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
దానికి ముఖ్య కారణం ‘అర్జున్ రెడ్డి’ చిత్రం అని చెప్పాలి.ఎందుకంటే అర్జున్ రెడ్డి చిత్రాన్ని షాహిద్ కపూర్, కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో విడుదల చేశాడు.ఈ చిత్రం ఇక్కడ భారి వసూళ్లను రాబట్టడమే కాకా హిట్ట్స్ లేక సతమత మావ్వుతున్న షాహిద్ కపూర్ కు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది.తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఓ టీవి షో కి హాజరయ్యాడు.
ఆ షో కి బాలీవుడ్ ఏ గ్రేడ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అటెండ్ అయ్యారు అందులో రన్వీర్ సింగ్, మనోజ్ బాజ్ పాయి, అలియా భట్, దీపిక పదుకొనే, ఆయుష్మాన్ ఖురాన్, ఉన్నారు.వాళ్ళ పక్కన విజయ్ కి చోటు దక్కడం వాళ్ళతో మాట్లాడటం అనేది విజయ్ కి దక్కిన గౌరవమనే చెప్పాలి.
మొదటి నుండి విజయ్ ని బాలీవుడ్ మీడియా ఓ స్టార్ లాగా చూస్తుంది.అలాంటి అవకాశం దక్కడం విజయ్ దేవరకొండకు చాల గొప్ప అనే చెప్పాలి.ఎందుకంటే తక్కువ సమయంలోనే మంచి పేరు రావడం ఒక్కటయితే.బాలీవుడ్ జనాల్లో మరియు బాలీవుడ్ లో విజయ్ ప్రత్యేకమైన స్థానం ఉన్నది అనే విషయం ఇలాంటి సంఘటనల వలెనే తెలుస్తుంది.