ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం సినిమాలో నటించింది.వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా నటించారు.ఇలా వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.
ఇక అప్పటినుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది.ఇదిలా ఉండగా వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక వీరిద్దరూ విదేశాలలో తరచు ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో వీరి ప్రేమ వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు వార్తలు వినిపించాయి.అంతే కాకుండా ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందన్న వార్తలు గట్టిగా ప్రచారం అయ్యాయి.
ఇలా వీరి ప్రేమ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో రష్మిక ఈ విషయం పై స్పందిస్తూ తమ మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని స్పష్టం చేసింది.అయినప్పటికీ వీరి ప్రేమ వార్తలకు మాత్రం బ్రేక్ పడలేదు.
ఇక తాజాగా విజయ్, రష్మిక ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.వీరి దుబాయ్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
అంతే కాకుండా విజయ్ తాజాగా అక్కడి నుంచి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇలా ఇద్దరు కలిసి దుబాయిలో ఎంజాయ్ చేయటంతో వీరి మధ్య ప్రేమ బంధం ఉందని నెటిజన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు.అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైతే జంట చూడముచ్చటగా ఉందని వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు .ప్రస్తుతం వీరి దుబాయ్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రష్మిక ఇటు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ అయింది.ఇక లైగర్ సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న విజయ్ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.
అయితే సమంత అనారోగ్యం వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడింది.