టాలీవుడ్ రొమాంటిక్ పెయిర్ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.వీళ్లిద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు.వీళ్ళు జంటగా నటించిన మొదటి సినిమా గీత గోవిందం.ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ రొమాంటిక్ జంటగా పేరు తెచ్చుకున్నారు.ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన ఆ సినిమా పెద్దగా మెప్పించలేక పోయింది.
అయితే వీరి జంటకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి.
అప్పట్లో వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని కూడా వార్తలు ఓ రేంజ్ లో వచ్చాయి.కానీ వీళ్ళు అవేమి పట్టించుకోకుండా కెరీర్ పై ద్రుష్టి పెట్టారు.
రష్మిక వరస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ అక్కడ కూడా పేరు తెచ్చుకోవాలని పరితపిస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ రష్మిక మరొకసారి కలిసి నటించబోతున్నారు.అయితే వీళ్ళు నటించబోయేది సినిమాలో కాదు ఒక యాడ్ లో కలిసి నటిస్తున్నారు.తాజాగా సంతూర్ కొత్త బ్రాండ్ అబాసిడర్స్ గా విజయ్, రష్మిక ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.తాజాగా వీరిపై ఒక యాడ్ కూడా షూట్ చేసారని సమాచారం.ఇప్పుడు ఆ యాడ్ కు సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది.
ఆ ఫొటోలో విజయ్ మోకాళ్లపై కూర్చుని ఒక గిఫ్ట్ ను రశ్మికకు అందిస్తున్నట్టు ఈ ఫొటోలో కన్పిస్తుంది.
త్వరలో ఈ హిట్ పెయిర్ ఇప్పుడు బుల్లితెరపై కూడా కనిపించి సందడి చేయబోతున్నారన్న మాట.ఇది ఇలా ఉండగా రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటు హిందీలో మిషన్ మజ్ను సినిమా చేస్తుంది.అటు విజయ్ లైగర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.