గీతాగోవిందం సినిమాతో టాలీవుడ్ లో రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన.కన్నడ భామ రష్మిక విజయ్ తో పండించిన స్క్రీన్ ప్రెజెన్స్ యూత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో సారి డియర్ కామ్రేడ్ అనే సినిమాతో ఈ జంట మళ్ళీ సందడి చేయబోతుంది.ఆ మధ్య వచ్చిన ట్రైన్ కిస్ సీన్ తో మరోసారి ఈ క్రీజీ జంట రొమాన్స్ పిచ్చెక్కించడం గారంటీ అనే మాట వినిపిస్తుంది.
ఇక రష్మిక విజయ్ తో నటించిన తర్వాత టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయి, ఏకంగా అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే మళ్ళీ ఈ కాంబినేషన్ మూడో సారి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆనంద్ అనే కొత్త దర్శకుడుతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ త్రిభాషా చిత్రం ప్లాన్ చేసాడు.ఇది కార్ల రేసింగ్ నేపధ్యంలో సాగే స్టొరీ అని తెలుస్తుంది.అందులో హీరోయిన్ గా మళ్ళీ రష్మికని ఫైనల్ చేసే ఆలోచనతో దర్శకుడు ఆనంద్, విజయ్ దేవరకొండ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే డియర్ కామ్రేడ్ లో టాక్ బట్టి నెక్స్ట్ సినిమాలో రష్మిక పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒక వేళా మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అయితే విజయ్, రష్మిక జోడీ రొమాన్స్ ని మరో సారి ఆడియన్స్ కి ఆస్వాదించే అవకాశం వస్తుందని చెప్పాలి.