విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన నటన ప్రతిభతో పాటు, మంచి అభిమానంను దక్కించుకున్న రౌడీ స్టార్ తాజాగా ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈయన తన తర్వాత సినిమా హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్తో ప్రేమలో ఉన్నాడని, ఆమె మనస్థత్వం మరియు ఆమె పద్దతి బాగా నచ్చడం వల్లే ఆమెకు ఫిదా అయ్యి పెళ్లికి సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది.
విజయ్ దేవరకొండ పేరు చెప్పకుండా తాను ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.మరి అతడు ఎవరో కూడా చెప్పండి మీరే అంటూ ఐశ్వర్య రాజేష్ మీడియా వారిని ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో తను ప్రేమలో లేనని మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోవద్దంటూ సూచించింది.
ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా కేవలం సినిమాలపైనే ఉందని, అసలు తాను ఎప్పుడు కూడా పెళ్లి విషయమై ఆలోచించలేదు అంటూ చెప్పుకొచ్చింది.మీడియాలో ఇలాంటి వార్తలు రాసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆమె కోరింది.నేను ప్రేమలో పడితే గర్వంగా వెంటనే సోషల్ మీడియా ద్వారా అందరికి చెప్పేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.
త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి ఈమె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రంను చేయబోతుంది.ఈమె తెలుగులో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.