టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇమేజ్ ని ఉపయోగించుకొని హీరోగా తెరంగేట్రం చేసిన అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ మొదటి సినిమానే డిఫరెంట్ గా ఫీల్ గుడ్ జోనర్ లో ఎంచుకున్నాడు.అన్న రొమాంటిక్ టచ్ లో సినిమాలు చేస్తూ ఉంటె తాను మాత్రం ఫీల్ గుడ్, ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకున్నాడు.
దొరసాని సినిమాతో హీరోగా కంటే నటుడుగా మంచి మార్కులు వేసుకున్న ఆనంద్ తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ తో వినోత్ అనంతోజు అనే యువ దర్శకుడు దర్శకత్వంలో రెండో సినిమా ఒప్పుకున్నాడని ఆ మధ్య టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ సినిమా పట్టాలు ఎక్కకముందే ఆనంద్ మూడో సినిమాని స్టార్ట్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయినట్లు తెలుస్తుంది.
దామోదర అట్టాడ అనే యువ దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాలలో జరుగుతుందని సమాచారం.
ఇక ఈ సినిమాలో ఆనంద్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.టాంగా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలతో పాటు టైటిల్ ని త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.