విజయ డైరీ కి చైర్మెన్ పదవి భూమా కుటుంబం కు వారసత్వంగా వస్తుంది.ఎప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నారు.
కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి రావడంతో చైర్మెన్ పదవి కి ఓటింగ్ జరగాలని జగన్ ఆదేశాలను జారీ చేశాడు.అందుకే భూమా ఫ్యామిలీ ఈసారి ఎన్నికను ఎదుర్కోవలిసి వస్తుంది.
ప్రస్తుతం భూమా నాగి రెడ్డి తమ్ముడు నారాయణ రెడ్డి చైర్మెన్ గా భాద్యతలను నిర్వహిస్తున్నాడు.గత 25 ఎండ్లుగా ఆయనే ఆ పదవిని అనుభవిస్తున్నాడు.
ఇప్పుడు ఆ సీట్ కోసం ఎన్నికల జరుగుతుండటంతో టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ ఆ ఎన్నికలను సవాల్ గా తీసుకొనున్నారు.
వైసీపీ నుండి అఖిల ప్రియ మేనమామ ఎస్వి జగన్ మోహన్ రెడ్డి ఆ పదవిపై ఆశ పెట్టుకున్నాడు.
ఒకే కుటుంబం నుండి ఇరువురు పోటీ పడటంతో నంధ్యాల రాజకీయం ఉత్కంట నెలకొన్నది.ఎస్వి జగన్ మోహన్ రెడ్డి విజయ్ డైరీ లో ఎన్నో అవకతవకులు జరిగాయని ఆరోపిస్తున్నాడు.
నారాయణ రెడ్డి హయాంలో ఎన్నో మోసాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నాడు.అటు 25 ఏండ్లుగా చైర్మెన్ గా కొనసాగుతున్న నారాయణ రెడ్డి కూడా ప్రెస్టీజియస్ గా తీసుకోబోతున్నాడు.
ఏడాదికి 140 కోట్ల టర్నోవర్ చేసే విజయ డైరీ కోసం సొంత కుటుంబంలోనే గట్టిపోటీ నెలకొనబోతుంది.మరి భూమా అఖిల ప్రియ కూడా తన చిన్నాన కోసం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.