ఈ రోజు తమిళ నాడులో పోలింగ్ జరుగుతుంది.ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తమిళనాడులోని అన్ని నియోజక వర్గాల్లో ఒకేరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తమ ఓటును వినియోగించుకున్నారు.
తాజాగా విజయ్ దళపతి కూడా తన ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కు వచ్చారు.
అయితే విజయ్ అందరిలాగా రాలేదు.
చెన్నై లోని ఆయన ఇంటి దగ్గర నుండి పోలింగ్ బూత్ వరకు సైకిల్ మీద వచ్చారు.ప్రస్తుతం విజయ్ సైకిల్ మీద వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే విజయ్ సైకిల్ మీద రావడానికి స్ట్రాంగ్ రీజన్ ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆయన పెట్రోల్ ధరలకు నిరసనగా ఇలా సైకిల్ మీద వచ్చి తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు.
విజయ్ కు ఇదేమి కొత్త కాదు.ఎప్పుడు కుదిరితే అప్పుడు మోదీ సర్కార్ ను ఎండగడుతూనే ఉంటాడు.తాజాగా తాను ఓటు వేయడానికి సైకిల్ పై రావడం కూడా మోదీ సర్కార్ ను ఇండైరెక్ట్ గా కడిగి పారేసినట్టు టాక్.ఇక ఆయన సైకిల్ పై రావడంతో ఇది చుసిన అభిమానులు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా.విజయ్ ఇలా సైకిల్ పై వచ్చి ప్రజలకు మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగాఆయన సినిమాల విషయానికి వస్తే.ఈ మధ్యనే విజయ్ దళపతి మాస్టర్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా విజయ్ 65 వ సినిమాగా తెరకెక్కుతుంది.