టాలీవుడ్లో లాక్డౌన్ సమయంలో చాలా మంది హీరోలు పలు ఛాలెంజ్లను చేస్తూ కనిపించారు.ఇందులో చాలా మంది #BeAManChallenge అనే ఛాలెంజ్ను చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా టాలీవుడ్లో స్టార్స్ అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను చేపడుతున్నారు.కాగా ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నాడు.
అయితే ఈ పుట్టినరోజును కాస్త విభిన్నంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఓ మొక్కను నాటడం జరిగింది.ఈ విధంగా తనకు పర్యావరణ పరిరక్షణపై ఎలాంటి బాధ్యత ఉందో తెలియజేశాడు.
ఇక తన పుట్టినరోజున చేస్తున్న ఈ మంచి పనిని మరికొందరు కూడా చేయాల్సిందిగా ఆయన కోరాడు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, అందాల భామ శృతి హాసన్లు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించాల్సిందిగా వారి పేర్లను నామినేట్ చేశాడు.
కాగా తాజాగా మహేష్ విసిరిన ఛాలెంజ్ను తమిళ హీరో విజయ్ స్వీకరించాడు.ఆయన కూడా తన ఇంటి పరిసరాల్లో ఒక మొక్కను నాటాడు.
‘మహేష్ ఇది నీ కోసమే’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇలా ఓ స్టార్ హీరో ఛాలెంజ్ విసరడం, మరో స్టార్ హీరో దాన్ని స్వీకరించి చేయడం వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలుపుతుందని ఆయా హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.