నయనతార విగ్నేష్ దంపతులు పెళ్లయిన మరుసటిరోజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా తిరుమల ఆలయానికి వెళ్లిన నయనతార దంపతులకు తిరుమలలో చేదు అనుభవం ఎదురయింది.
స్వామివారి దర్శనం అనంతరం ఫోటోషూట్ కోసం తిరుమల మాడ వీధులలో ఈ జంట చెప్పులు వేసుకుని తిరగడంతో ఎంతోమంది భక్తులు వీరి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వీరిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఈ విధంగా నయనతార దంపతులకు తిరుపతిలో ఎదురైన చేదు అనుభవం పై, దర్శకుడు విగ్నేష్ స్పందిస్తూ బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పారు.
ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం.నిజానికి మా వివాహాన్ని తిరుమలలోనే చేసుకోవాలని భావించాము.అయితే కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకొని వివాహం మహాబలిపురంలో జరిగిందని అయితే వివాహం జరిగిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళకుండా ముందుగా స్వామివారి దర్శనం చేసుకోవడం కోసమే తిరుమలకి వచ్చామని తెలిపారు.
స్వామివారి దర్శనం ముగిసిన తర్వాత ఆలయం ముందు ఫోటో షూట్ చేసుకోవాలని భావించాము అయితే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కాసేపు ఆగి ఫోటోషూట్ కోసం వచ్చామని ఆ సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయామని విగ్నేష్ తెలిపారు.మాకు దేవుడు పై ఎంతో నమ్మకం ఉంది పెళ్లికి 30 రోజులు ముందుగా ఏకంగా స్వామివారిని ఐదుసార్లు దర్శనం చేసుకున్నామని, ఈ విధంగా స్వామి వారిని అమితంగా నమ్మే మేము స్వామివారిని అగౌరవపరచారని, ఇలా ఉద్దేశపూర్వకంగా అపచారానికి పాల్పడలేదని తెలిపారు.పొరపాటున జరిగిన ఈ తప్పు వల్ల మనోభావాలు దెబ్బ తిన్న వారందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు.
అదేవిధంగా తమ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.