బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కెరీర్ లో డర్టీ పిక్చర్ ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే.సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు నటిగా విద్యాబాలన్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో విద్యాబాలన్ నటనకు జాతీయ అవార్డు వచ్చింది.ఈ సినిమా విడుదలై పది సంవత్సరాలు అయినా టీవీలో ఈ సినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విద్యాబాలన్ డర్టీపిక్చర్ సినిమా గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.డర్టీపిక్చర్ సినిమాను తాను తల్లిదండ్రులతో కలిసి చూశానని సినిమా విషయంలో తల్లి ఒక విధంగా స్పందిస్తే తండ్రి మరో విధంగా స్పందించారని ఆమె అన్నారు.
సినిమా చూసిన తరువాత అమ్మ సినిమాలోని తన పాత్రను చూసి కన్నీళ్లు పెట్టుకుందని ఆమె పేర్కొన్నారు.తండ్రి మాత్రం ఆ పాత్రను చప్పట్లు కొట్టి అభినందించాడని ఆమె చెప్పారు.
డర్టీపిక్చర్ సినిమాలో నటించడానికి కుటుంబం నుంచి తనకు కుటుంబం నుంచి మద్దతు లభించిందని విద్యాబాలన్ తెలిపారు.సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో తాను చనిపోతానని అలా చనిపోవడం అమ్మ జీర్ణించుకోలేకపోయిందని విద్యాబాలన్ చెప్పారు.ఆ సినిమాలోని పాత్ర అమ్మకు చీప్ గా కనిపించకపోవడం తనకు సంతోషంగా చూపించిందని విద్యాబాలన్ తెలిపారు.
సిల్క్ స్మిత పాత్రలో నటించిన సినిమాను సక్సెస్ చేసినందుకు విద్యాబాలన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
శోభాకపూర్, ఏక్తాకపూర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించగా మిలన్ లూథ్రియా ఈ మూవీని డైరెక్ట్ చేశారు.ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి.శృంగార తార సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ జీవించగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడం గమనార్హం.
.