లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడి ఉండటంతో పాటు భవిష్యత్తులో కరోనా వైరస్ ప్రభావం తగ్గెంత వరకు థియేటర్ లో సినిమాల రిలీజ్ కి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఈ నేపధ్యంలో చాలా మంది నిర్మాతలు థియేటర్ లో రిలీజ్ కోసం వేచి చూడకుండా ఒటీటీ ప్లాట్ ఫాంలని ఆశ్రయిస్తున్నారు.
ఇప్పటికే చాలా సినిమాలు ఒటీటీ బాట పట్టాయి.తెలుగులో కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే హిందీలో విద్యాబాలన్ నటించిన బయోపిక్ సినిమా శకుంతలాదేవి కూడా అమెజాన్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.దీనికి సంబందించిన అమెజాన్ ప్రైమ్ తో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.
అను మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం మే విడుదల కావాల్సింది.అయితే లాక్డౌన్ కారణంగా విడుదల నిలిచిపోయింది. శకుంతలాదేవి చిత్రాన్ని జులై 31న విడుదల చేసే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే అమెజాన్ తో సినిమాకి సంబందించిన ఒప్పందం జరిగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో రిలీజ్ డేట్ కూడా నిర్ణయించుకున్నట్లు టాక్.హ్యూమన్ కాలిక్యుటర్, హ్యూమన్ కంప్యూటర్గా పేరు పొందిన శకుంతలాదేవి జీవిత కథ ఆధారంగా ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమా వస్తోంది.