సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాను పూర్తిగా ఆర్ధిక నేరల బ్యాక్డ్రాప్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాలో మహేష్ సోదరి పాత్రలో ఓ బాలీవుడ్ లేడీ స్టార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.సర్కారు వారి పాటలో మహేష్ సోదరిగా కీలకమైన పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ను చిత్ర యూనిట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె కూడా తన పాత్ర చాలా కీలకంగా ఉండటంతో వెంటనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో సాగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర వర్గాలు.