ప్రస్తుతం ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీ తో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు అద్భుతమైన సన్నివేశాలను ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నారు.ఈ తరుణంలోనే 3డి టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందడంలో ముందంజలో ఉంది.3D డిస్ప్లే లో కనిపించేవి అన్ని మన ముందే ఉన్నట్టు అనుభూతి పొందే విధంగా టెక్నాలజీని ఉపయోగించి వాటిని రూపుదిడుతుంది.ఈ 3D డిస్ప్లే లను ఎక్కువ చైనా, ఉత్తర కొరియా వారు రోడ్లపై ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్య పరుస్తూ ఉన్నారు.
తాజాగా చైనాలోని చెంగ్డూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక 3D డిస్ప్లే వీక్షించిన మహిళ అక్కడి నుంచి పరుగులు పెట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ మహిళ పరుగులు పెట్టాల్సిన అంత సీన్ అందులో ఏముందని అనుకుంటున్నారా.? 3D స్క్రీన్ లోపల ఉన్న సింహం బయటకు వచ్చినట్లు ఆ వీడియో ఉండడం, స్క్రీన్ బద్దలుకొట్టి సింహం బయటకు వచ్చినట్లు అనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా ఆ ప్రాంతం నుంచి పరుగులు పెట్టింది.
అలాగే గువాన్యిన్ క్వియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన 3D స్క్రీన్లలో ఫ్లయింగ్ సాసర్ 3D వీడియోలు కూడా ప్రజలను బాగా ఆశ్చర్యపరుస్తుంది.
రైలు, విమానాలు లాంటి వాహనాలు ఒక్కసారిగా ప్రజల మధ్యకు వచ్చేస్తున్నాయి ఏమో అన్నట్లుగా చిత్రీకరణ చేయడంతో.ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ఇలాంటి టెక్నాలజీ తోనే గత సంవత్సరం సౌత్ కొరియా లో ఏర్పాటుచేసిన 3D డిస్ప్లే కూడా సామాజిక మాధ్యమాలలో చాలా వైరల్ అయింది.సియోల్ నగరంలో ఏర్పాటుచేసిన సముద్రాలలో 3D వీడియో ప్రజలను బాగా ఆకట్టుకుంది.
దానిని చూసిన వారి కళ్ళ ముందుకే సముద్రమే వచ్చింది అనే విధంగా ఆ వీడియో బాగా ఆకట్టుకుంది.ఇలా 3D డిస్ప్లే వీడియోలు ప్రజలను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించండి.