మన దేశంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయో అందరికీ తెలిసిందే.రోడ్లకు గుంతలు పడి అధ్వానంగా ఉంటాయి.
ఇలాంటి రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు నరకం చూస్తుంటారు.అయితే రోడ్డు గుంతలను పూడ్చటానికి మన దగ్గర పెద్దగా టెక్నాలజీని ఉపయోగించరు.
గుంతలకు ప్యాచ్ లు వేస్తుంటారు అంతే…
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర రోడ్డు గుంతలకు ఓ పరిష్కారం చూపారు.ఆ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో అందరికీ తెలిసిందే.
నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన పోస్టుతో నెటిజన్లను ఆకట్టుకుంటారు.తాజాగా ఆయన ఓ అద్భుతమైన వీడియో షేర్ చేశారు.
రోడ్డుపై ఉన్న గుంతలను ఆధునిక టెక్నాలజీతో ‘ప్యాచెస్’ ద్వారా పూడ్చి వేస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.దేశంలోని రోడ్లు, గుంతలకు ఇది ఒక సొల్యుషన్ అన్నారు.
ఈ ఆవిష్కరణ ఇండియాకు అవసరమని, కొన్ని బిల్డింగ్ లేదా కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు ఈ టెక్నాలజీని కచ్చితంగా ఉపయోగించాలని, ఈ సంస్థతో సంప్రదించి వెంటనే చర్యలు ఇక్కడ కూడా చర్యలు చేపట్టాలని ఆనంద్ మహీంద్ర కోరారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్ర చూపించిన టెక్నాలజీ నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ టెన్నాలజీ భలే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఇండియాలో గుంతలను పూడ్చడానికి ఈ టెన్నాలజీ సరిపోదని, ఇలాంటి టెక్నాలజీ వస్తే కాంట్రాక్టర్లు రోడ్లను మరమ్తులు చేయడం మానేసి ప్యాచ్ లతో నింపేస్తారని కామెంట్ చేశారు.
ఏదీ ఏమైనా ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.