వీధులలో తోపుడు బళ్ల మీద అమ్మే టిఫిన్స్ కోసం జనం బారులు తీరుతూ ఉంటారు.వారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
ఈ కారణంగానే చాలా మంది ఉదయం వేళలో టిఫిన్ బళ్ళు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు.అయితే ఇలాంటి టిఫిన్ బళ్ల దగ్గర ఆహార నాణ్యత ప్రమాణాలు, శుబ్రత ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్ని లేదు.
బిజీ జీవితంలో జీవనం సాగించే నగర వాసులు ఏదో కడుపు నింపు కోవడానికి ఇలాంటి తోపుడు బళ్ల వద్దకి వెళ్తూ ఉంటారు.అయితే వీరు మాత్రం వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ ఉంటారు.
తమ డిమాండ్ దృష్యాుప ఎలా పడితే అలా మురుగు నీటితో చట్నీలు తయారు చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇడ్లీ బండివాలా చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉదయాన్నే ఇడ్లీ బండి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి అందులోని కుళాయి తెరిచి నీళ్లు పట్టుకుంటున్న వీడియోను తీసి స్థానికులు నిలదీయగా అతని నోట మాటరాలేదు.అంతే కాదు అక్కడ నీళ్లను అక్కడే వదిలేసి పారిపోయాడు.
అయితే ఈ వీడియోను తీసిన వారు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.ఇక ఈ ఘటన హైలెట్ కావడంతో దీనిపై ఆహార నాణ్యత ప్రమాణాల అధికారులు స్పందించారు.
అతనిని గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు.