బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ ఇటీవలే డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం అందరికి తెలిసిందే.గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
పెళ్లి చేసుకున్నారు అన్న మాటే కానీ ఆ పెళ్లి మూడునాళ్ళ ముచ్చట అన్నట్టు అయిపోయింది.ఎందుకంటే పెళ్లి తర్వాత విక్కి, కత్రినా కైఫ్ కొద్ది రోజులు రొమాంటిక్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తారు అని అనుకున్నారు.
కానీ వారి హనీమూన్ కి వెళ్లడం కాదు కదా కనీసం ఒక ఇంట్లో కూడా ఉండటం లేదు.పెళ్లి అయిన వారం రోజులకే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు కత్రినా కైఫ్ ఈ నెల 15 నుంచి బిజీ కాబోతుండగా, విక్కీ కౌశల్ 20వ తేదీ నుంచి కంటిన్యూగా 50 రోజులు దూరంగా వెళ్తున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సినిమా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు సీక్వెల్ గా టైగర్ 3 సినిమా రాబోతోంది.టైగర్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ కత్రినా జోడీ కడుతున్నారు.
డిసెంబర్ 15 నుంచి కత్రినాకైఫ్ పాల్గొనబోయే సినిమా కూడా టైగర్ 3 నే.కొద్దిరోజులు సల్మాన్ ఖాన్ తో కలిసి పలు సన్నివేశాల్లో నటించడానికి చిత్రీకరణలో పాల్గొని, అనంతరం జనవరి నెలలో మరొక షెడ్యూల్ ఢిల్లీలో ఉండటంవల్ల 2022 తొలి నెలలోనే ఢిల్లీకి వెళ్లనుంది.విక్కీ కౌశల్ కూడా ఫుల్ బిజీయేనట.
అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అచ్చట ముచ్చట కూడా తీరకముందే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు.దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తోన్న ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమా కోసం ఇండోర్ వెళ్లనున్నాడు.అక్కడే డిసెంబర్ 20 నుంచీ 50 రోజుల పాటూ సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేయనున్నాడు.
‘గోవిందా నామ్ మేరా, సామ్ బహదూర్’ టైటిల్స్తో మరో రెండు సినిమాలు కూడా విక్కీ 2022లో పూర్తి చేయాల్సి ఉంది.మొత్తంగా చూస్తే కత్రీనాతో కాస్త హ్యాపీగా కాలం గడపటానికి విక్కీకి ఇంకా చాలా రోజులే పట్టేలా ఉంది.