దేశంలో కరోనా టీకా ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి దేశ వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం గా రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి నిన్నటి వరకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా దేశంలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్ అమలు కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశ ప్రధాని మోడీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా టీకా వేయించుకోవటం జరిగింది.
కాగా తాజాగా దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
చెన్నై లోని ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ లో కరోనా టీకా తొలి డోసు వేయించుకోవటం జరిగింది.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ మరో ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రెండో డోసు తీసుకుంటాను అని అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీక వేయించుకోవాలి అని కోరారు.
అంత మాత్రమే కాక కరోనా మహమ్మారి కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
.