వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి విశిష్ట గౌరవం..!!

వైసీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డికి విశిష్ట గౌరవం లభించింది.విషయంలోకి వెళ్తే ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కి ఎంపిక చేస్తూ భారత ఉపరాష్ట్రపతి ఇంకా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ ఆమోదం తెలపడం జరిగింది.

 Vice President Appointed Ycp Mp Vijaysai Reddy  As Vice Chairman Of Rajyasabha ,-TeluguStop.com

రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గైర్హాజరులో విజయసాయి.రాజ్యసభ వైస్ చైర్మన్ హోదాలో సమావేశాలను నడిపిస్తారు.

విజయసాయి రెడ్డితో పాటు మరో ఏడుగురికి ఈ ప్యానల్ లో అవకాశం లభించింది.

ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో తననీ వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఉపరాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ క్రమంలో రాజ్యసభ నిర్వహణధికారుల కొత్త పేర్లను రాజ్యసభ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.

ఆ లిస్టులో విజయసాయి రెడ్డితో పాటుగా భుభనేశ్వర్ కలితా, వందనా చవాన్, సుఖేందు శేఖర్ రే, డాక్టర్ ఎల్.హనుమంతయ్య, ఇందు బాలా గోస్వామి, డాక్టర్ సస్మిత్ పట్రా, తిరుచ్చి శివ.,ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube