సందీప్ కిషన్ టైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి విఐ ఆనంద్.మొదటి సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు రెండో సినిమాని అల్లు శిరీష్ తో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ జోడించిన కథాంశంతో సినిమా చేశాడు.
ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.తరువాత నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమాకి హర్రర్ కథాంశం తీసుకొని దానికి కాస్తా ఫిక్షన్ మిక్స్ చేసి, లవ్ స్టోరీగా తెరకెక్కించారు.నిఖిల్ కెరియర్ లో ఇది ఓ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.
ఆ తర్వాత ఏకంగా మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని విఐ ఆనంద్ సొంతం చేసుకున్నాడు.ఇది కూడా విభిన్న ఎలిమెంట్ తో తెరకెక్కించిన సినిమానే.
చనిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోస్తే అనే కాన్సెప్ట్ చేసిన ఈ సినిమాలో రొటీన్ రివేంజ్ డ్రామా జోడించడం వలన డిజాస్టర్ అయ్యింది.ఈ డిజాస్టర్ ఎఫెక్ట్ తో కొంత గందరగోళంలో పడ్డ విఐ ఆనంద్ మళ్ళీ తనకి అలవాటైన ట్రాక్ లోకి వచ్చి సినిమా చేయబోతున్నాడు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ విఐ ఆనంద్ తో సినిమా చేయబోతుంది.ఓ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా విఐ ఆనంద్ చెప్పబోతున్నాడు.
దీనికోసం నలుగురు కమెడియన్స్ ని లీడ్ రోల్ కోసం తీసుకుంటున్నాడు.అందులో రెండు పాత్రల కోసం సత్య, శ్రీనివాసరెడ్డిని ఫైనల్ చేశారు.మరో రెండు పాత్రల కోసం కూడా స్టార్ కమెడియన్స్ ని తీసుకునే పనిలో ఉన్నాడు.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు.
త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.