అయోధ్య ట్రస్ట్ పై అసత్య ప్రచారాలు చేయడం తగదని.ఇన్నాళ్లు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకించిన వారే ఇప్పుడు అయోధ్య ట్రస్టు విషయంలో నెగటివ్ ప్రచారం చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.
ట్రస్టు పై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన చెప్పారు.రామ మందిరం భూ లావాదేవీలన్ని పూర్తి పారదర్శకంగా జరిగాయని అన్నారు.
సజావుగా సాగుతున్న మందిర నిర్మాణాన్ని ఆప్, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమించిన వి.హెచ్.పి మందిర ట్రస్టుపై దేశ ప్రజలు పూర్తి విశ్వసనీయతని చాటుతూ పెద్ద ఎత్తున మందిర నిర్మాణానికి విరాళాఉ ఇచ్చారని ఆయన చెప్పారు.
రామ భక్తులు ట్రస్టుకి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారీగా ఉంటుందని అలోక్ కుమార్ చెప్పారు.భక్తుల విరాళాలతోనే అయోధ్యలో భవ్వ్య మందిర నిర్మాణం జరుగుతుందని అన్నారు.
ఎవరు ఎన్ని అడ్డకులు సృష్టించినా సరే శ్రీరామ కార్యాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.ఫేస్ టు ఫేస్ డిబెట్ లో ప్రూవ్ చేసుకోలేక ఆప్ నేత సంజయ్ సింగ్ పారిపోయాడని.
అయోధ్య రాముని గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.