కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలబడతానంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియాగాంధీ ఆదేశిస్తే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో పోటీకి నేతలు వెనుకాడటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం.కాగా, అధ్యక్ష పదవికి రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుండగా.
ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.