కడప జిల్లా కడప పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ పాత్రికేయులు శశిశ్రీ అనారోగ్యంతో ఈరోజు మరణించారు.ఆయన సాహితి వేత్తగా పలు సన్మానాలు అందుకున్నారు .20వరకు పుస్తకాలు రాసారు .అయితే , ఆయన సిపి బ్రౌన్ జీవిత చరిత్ర చాలా కాలం పరిశోధనలోకి పోయి మరి ఆ గ్రంధాన్ని వెలువరించారు .ఆయనకు ఎనలేని పేరు వచ్చింది .ఇక జర్నలిస్టుగా పత్రికా రంగానికి సేవలు అందించారు .పొట్టి శ్రీరాములు వర్సిటీలో సాహిత్య సభ్యులు గా ఉన్నారు శశిశ్రీ మృతికి జర్నలిస్టు సంఘాల నేతలు, స్థానిక పాత్రికేయులు, సాహిత్యాభిమానులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు