టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో 100కు పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య అనుకోకుండా విమాన ప్రమాదంలో మరణించడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
అయితే తాజాగా నటి సౌందర్య స్నేహితురాలు మరియు ఒకప్పటి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “ఆమని” ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని నటి సౌందర్య గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా నటి సౌందర్య కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలని చాలా కష్టపడిందని తెలిపింది.
అంతేగాక సౌందర్యకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని, దాంతో తన తండ్రి మాటకి సౌందర్య ఎప్పుడూ కూడా ఎదురు చెప్పేది కాదని అంతగా తన తండ్రిని ప్రేమించేదని చెప్పుకొచ్చింది.ఇక సౌందర్య తల్లి కూడా చాలా మంచి వ్యక్తి అని ఇంటికి తాను ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ఆప్యాయంగా పలకరించేదని సౌందర్య కుటుంభం సభ్యులతో తనకున్న అనుంబంధం గురించి తెలిపింది.
నటి సౌందర్య ఒకప్పుడు బెంగళూరులో నివసించిన తన సొంత ఇల్లు ప్రస్తుతం పట్టించుకునేవారు లేక బూత్ బంగ్లా గా మారిపోయిందని, క్రితం సారి వెళ్ళినప్పుడు తాను చూశానని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది.
అంతేకాక ఎప్పుడూ కూడా నటి సౌందర్య తనతో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేదని, తనకి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అత్యంత సన్నిహితులలో సౌందర్య ఒకరని తెలిపింది.
అయితే సౌందర్య హీరోయిన్ కావడానికి ఎంతగా కష్ట పడిందోనని, కానీ ఆ స్టార్ డమ్ అనుభవించకుండానే కన్నుమూసిందని అందుకు తనకు ఇప్పటికీ ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ఆమని సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
కాగా తాజాగా తెలుగులో హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న “చావు కబురు చల్లగా” అనే చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించింది.ఈ చిత్రంలో ఆమని కొంత మేర డిఫరెంట్ గా మద్యం సేవించే అలవాటున్న మహిళ పాత్రలో నటించింది.
కాగా ఈ చిత్రం ఈ నెల 19వ తారీఖున విడదల కానుంది.అలాగే ఆమని మరో రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.