కుష్బూ.ఈ పేరు వినగానే అందరికీ చిత్రపరిశ్రమలో ఫైర్ బ్రాండ్ అని గుర్తొస్తోంది.
కాగా నటి కుష్బూ ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా రెండు వందల కుపైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ఈ క్రమంలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.
అయితే వయసు మీద పడటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో నటి కుష్బూ ప్రస్తుతం సినిమాల పై పెద్దగా దృష్టి సారించడం లేదు.కాగా ఆ మధ్య ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ కూడా చేసింది.
కానీ అనుకోకుండా ఓటమి పాలైంది.
అయితే ఈ మధ్య కాలంలో నటి కుష్బూ సుందర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడూ తనకు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.కాగా తాజాగా నటి కుష్బూ సాంప్రదాయమైన చీర దుస్తులు ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అంతేకాకుండా ఈ ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.అంతేకాకుండా ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఈ వెటరన్ హీరోయిన్ మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోందా….? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కుష్బూ ఓడిపోవడంతో మళ్ళీ సినీ కెరియర్ పై దృష్టి సారించినట్లు సమాచారం.కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న “అన్నాతె” చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.అంతేకాకుండా తెలుగు ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లుసిఫర్ రీమేక్ లో హీరో చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.