తెలుగులో అప్పట్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన “అన్నమయ్య” చిత్రంలో హీరో మరదలు పాత్రలో నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ హీరోయిన్ “కస్తూరి శంకర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి కస్తూరి శంకర్ కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ మరియు షోలలో నటించి బాగానే ఆకట్టుకుంది.
అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సినీ సెలబ్రిటీల గురించి తప్పుడు కథనాలను మీడియా ప్రచారం చేస్తూ తమ వార్తలను ప్రజలకు అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా నిలిచింది.
అంతే కాకుండా మామూలుగా హెడ్డింగులు పెట్టి వార్తలను ప్రచురితం చేయడం వల్ల ప్రజలు పెద్దగా పట్టించుకోరని కానీ కాంట్రవర్సీ హెడ్డింగులు పెట్టి ప్రచురితం చేయడంవల్ల జనాలు మరింత ఆసక్తి కనబరుస్తూ కచ్చితంగా వార్తలను ఓపెన్ చేసి చదువుతారని ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ చాలా మంది తమ వార్తలను ప్రజలకు అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతేకాకుండా గత కొద్ది కాలంగా తాను రాజకీయాల్లోకి వస్తూ బిజెపి పార్టీలో చేరబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది.ఇందులో భాగంగా తనకి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం మరియు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
అంతేకాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ పై పూర్తిగా దృష్టి సారించానని దాంతో రాజకీయాల్లోకి వచ్చి సమయం వెచ్చించే సమయం లేదని క్లారిటీ ఇచ్చింది.దీంతో నటి కస్తూరి శంకర్ బిజెపి పార్టీలో చేరబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలకి పులిస్టాప్ పడింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కస్తూరి శంకర్ పలు తమిళ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.అంతే కాకుండా మరో వైపు బుల్లితెరపై కూడా నటిస్తోంది.కాగా ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన “స్టార్ మా” లో ప్రసారమయ్యే “ఇంటింటి గృహ లక్ష్మి” ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.