ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్రపిళ్లై బెయిల్ పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.
ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనున్నారు.
జూన్ 2న పిళ్లై బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో పిళ్లై ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా ఉన్నారని ఈడీ అభియోగిస్తుంది.
కాగా మార్చి 6వ తేదీన లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో పిళ్లైను అధికారులు అరెస్ట్ చేశారు.