యూపీలోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీద్ కేసులో వారణాసి జిల్లా కోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది.మసీద్ కాంప్లెక్స్ లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ పై తీర్పు వెలువడనుంది.
ఈ నేపథ్యంలో పోలీసులు వారణాసిలో 144 సెక్షన్ విధించారు.కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు.
ఈ పిటిషన్ అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ.ఆగస్ట్ 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు.
ఈ క్రమంలో నేడు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.