చాలా సంవత్సరాల నుంచి పెళ్లికి దూరంగా ఉన్న సెలబ్రిటీలు ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీల వివాహం వివాహం మే నెలలో గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.
మరకతమణి సినిమా సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.మే నెల 18వ తేదీన ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీ వివాహం చేసుకోవడం గమనార్హం.
ఆది నిక్కీ స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారి పెళ్లి చెసుకున్నారు.
ఆది పినిశెట్టికి తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు ఉంది.
నిక్కీ గల్రానీ తక్కువ సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీ జాతకాల గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రమని ఆది నిక్కీ జాతకాలను పోల్చి చూసిన సమయంలో వాళ్లవి షష్టాష్టకాలు అయ్యాయని వేణుస్వామి వెల్లడించారు.
జాతకాల ప్రకారం వాళ్లకు పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని వేణుస్వామి పేర్కొన్నారు.
ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీ భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పాలని ఆయన అన్నారు.నేను విడిపోవాలని వాళ్లకు చెప్పడం లేదని జాతకాలను బట్టి కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలని చెబుతానని వేణుస్వామి తెలిపారు.
జాతకాల ప్రకారం షష్టాష్టకాలు అయినప్పుడు పెళ్లికి దూరంగా ఉంటేనే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రేమ అనే పిచ్చి మూర్ఖత్వంతో మీరు పెళ్లి చేసుకుంటున్నారని తర్వాత విడిపోతే సమాజానికి ఏం జవాబు చెబుతారని ఆయన ప్రశ్నించారు.జాతకాల పరంగా విశ్లేషణ చేసి పరిహారాలు చేసుకోగలిగితే ఫలితం ఉంటుందని ఆయన అన్నారు.వేణుస్వామి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.